Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ.ఎస్.గవర్నమెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పందించాలని టీ.ఎస్.గవర్నమెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ కోరింది. హైదరాబాద్లో ఆదివారం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీ.వో.16ను న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటి వరకు క్రమబద్దీకరణ జరగలేదని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ జరగకముందే పదవీ విరమణ అవుతున్నారని, వారి కుటుంబాలకు ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం కలగడం లేదని పేర్కొంది. సీఎం జోక్యం చేసుకుని కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా కౌంటర్ దాఖలు చేసేలా చూడాలని, ఏ నెల జీతాలను ఆ నెలలో ఇవ్వాలని, సెలవులు పెంచాలని, కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఆరోగ్య బీమా కల్పించాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో తెలంగాణ పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు నాగటి నారాయణ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అందె సత్యం మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విదానం 2019 ఉన్నత విద్యారంగంపై ఏ విధంగా ప్రభావం చూపబోతున్నదనె విషయాలను వివరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, రాష్ట్ర ఇ.సి.మెంబర్స్ డాక్టర్ వి.శ్రీనివాస్, కె.పి.శోభన్ బాబు, సంగీత, ఉదయశ్రీ, శైలజ, డాక్టర్ పి.జగన్నాథం, డి.మధుకర్, కురుమూర్తి, జె.గంగాధర్ వైకుంఠం, ఎం.ప్రమిల్ కుమార్, ఎం.శ్రీనివాస్రెడ్డి, బి.సాయిలు తదితరులు పాల్గొన్నారు.