Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత రాజకీయాలు తగవు:ప్రముఖ చరిత్రకారుడు సుశీల్ పండిట్
హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్ చరిత్ర ఎంతో గొప్పదని ప్రముఖ చరిత్రకారుడు సుశీల్ పండిట్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని బేగంపేటలో గల ఓ హౌటల్లో 'అహం టాక్స్' ఆధ్వర్యంలో జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, 'ఇండియాస్ కాశ్మీర్ పాలసీ- గతం, వర్తమానం, భవిష్యత్తు' అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుశీల్ పండిట్ మాట్లాడుతూ.. కాశ్మీర్కు ఘనచరిత్ర ఉన్నదని తెలిపారు. వందలాది సంవత్సరాలుగా అక్కడి ప్రజలు కలిసి మెలిసి జీవిస్తున్నారని అన్నారు. భారత యూనియన్లో కాశ్మీర్ విలీనం షరతులతో కూడిన ఒప్పందమనీ, దానిని నేడు మత రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని చెప్పారు. సెక్యూలర్ దేశంగా ఉన్నందునే భారత్తో కలవడానికి ఆనాటి ఒప్పందం జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అహం టాక్స్ వ్యవస్థాపకురాలు మోనికా రెడ్డి పాల్గొన్నారు.