Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్కాజిగిరిలో ఆలస్యంగా వెలుగులోకి
నవతెలంగాణ-సిటీబ్యూరో
చేతికందిన కొడుకు వృద్ధాప్యంలో ఆసరగా నిలుస్తాడన్న ఆ తండ్రి ఆశలు అడియాశలయ్యాయి. కన్న కొడుకే తండ్రిని ముక్కముక్కలుగా నరికి బకెట్లలో దాచాడు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏసీపీ సందీప్, సీఐ మన్మోహన్ వివరాల ప్రకారం.. నగరంలోని కృష్ణానగర్కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మారుతీ(80)కి నలుగురు సంతానం. రెండో కుమారుడైన కిషన్ జులాయిగా మారి జల్సాలకు అలవాటు పడ్డాడు. ప్రతిరోజు తన జల్సాలకు డబ్బులివ్వాలని తండ్రిని వేధించేవాడు. తండ్రీకొడుకుల మధ్య రోజూ చిన్నపాటి ఘర్షణలు తలేత్తేవి. మూడ్రోజుల క్రితం తండ్రిని కత్తితో ముక్కలుముక్కలుగా అతికిరాతకంగా నరికి ఎవరికీ తెలియకుండా బకెట్లో దాచాడు. ఆదివారం కాలనీలో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న మల్కాజిగిరి పోలీసులు నిందితుడు కిషన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.