Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఆర్థిక అవకతవకల కేసులో మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి సంబంధించిన ఆరోపణలపై అరెస్టు అయిన హైదరాబాద్ వ్యాపారి సానా సతీశ్కు ఢిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోమవారం బెయిల్ మంజూరు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సతీశ్ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనురాధ శుక్లా భరద్వాజ్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. రూ. 5 లక్షల విలువైన గ్యారెంటీ కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలైలో మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో సానా సతీశ్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ అధికారుల విచారణలో మొయిన్ ఖురేషీకి సానా సతీశ్ అత్యంత సన్నిహితుడుగా గుర్తించారు. ఢిల్లీ వేదికగా మొయిన్ ఖురేషీ హవాలా వ్యాపారం చేసేవాడు. తనను ఈ కేసు నుండి బయటపడేసేందుకుగాను సీబీఐ అధికారులు లంచం అడిగారని మొయిన్ ఖురేషీ ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే కేసును నీరుగార్చే ప్రమాదం ఉందన్న సీబీఐ వాదనని కోర్టు తిరస్కరించింది.