Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ కమిషనర్కు టీఎస్టీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఇచ్చే గ్రాంట్ల ఖర్చు మార్గదర్శకాలను సవరించాలని తెలంగాణ రాష్ట్రోపాధ్యాయ సంఘం (టీఎస్టీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజరుకుమార్ను టీఎస్టీయూ అధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏటా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం ఇచ్చే గ్రాంట్ల ఖర్చుకు మార్గదర్శకాలు అసమంజసంగా ఉన్నాయని తెలిపారు. వారానికి కేవలం రూ.500 మాత్రమే నగదు రూపంలో ఖర్చు చేయాలని నిబంధనల్లో ఉండడం సరైంది కాదని పేర్కొన్నారు. అన్ని రకాల చెల్లింపులూ ఆన్లైన్, చెక్కు రూపంలో చేయాలని ఉండడం సరికాదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే 95 శాతం పాఠశాలలున్నందున అనేక ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. పాఠశాల విద్యా కమిటీ తీర్మానాల ఆధారంగా పాఠశాలల అవసరాలు, విద్యార్థుల బోధనాభ్యసన కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా గ్రాంటును ఖర్చు చేసుకునేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు. జీఎస్టీ బిల్లు తప్పనిసరి అన్న నిబంధనను తొలగించాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభమైన జూన్లోనే నిర్వహణ గ్రాంటు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్టీయూ నాయకులు శ్రీనివాస్రెడ్డి, రహమతుల్లా, వి సత్యనారాయణరెడ్డి తదితరులున్నారు.