Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సెకండ్ కౌన్సింగ్ ప్రక్రియను ప్రశ్నిస్తూ దాఖలైన రిట్లను రాష్ట్ర హైకోర్టు డిస్మిస్ చేసింది. తొలుత ఓపెన్ కో టా సీట్లను భర్తీ చేస్తే అందులో ప్రతిభ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీట్లు వస్తాయని, అలా కాకుండా ముందు రిజర్వేషన్ కోటా అమలు చేస్తే ఆ కోటాకు చెందినవాళ్లు జనరల్లో మెరిట్ సీట్లను నష్టపో యారని ఆదిలాబాద్ జిల్లా నుంచి నూతెంకి భావన ఇతరులు వేసిన రిట్ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్కుమార్, జస్టిస్ పి.కేశవరావుల డివిజ న్ బెంచ్ వద్ద కొట్టేసింది. ఈ నెల 14న వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు సోమవారం చెప్పింది.
వర్సిటీ, సర్కార్ నిర్వాకం వల్ల రిజర్వేషన్ల కేటగిరీ క్యాండెట్లు నష్టపోయారని పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్సిటీ వాదనను ఆమోదిస్తూ తీర్పు చెప్పింది. ఫస్ట్ కౌన్సెలింగ్లో వివిధ కారణాల వల్ల భర్తీ కాని సీట్లను రెండో కౌన్సెలింగ్లో భర్తీ చేయాలని, వీటిని ముందుగా జనరల్ కోటా సీట్లు, ఆ తర్వాత రిజర్వేషన్ కోటా సీట్లను భర్తీ చేయాలని జీవోలు 550, 114 చెబుతున్నాయని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. జీవో 550లోని నిబంధనలతోనే సర్కార్ జీవో 114 ఇచ్చిందని, దాంతో పాత జీవో 550 రద్దు అయినట్లేనని, కొత్త జీవో 114 అమల్లో ఉంటుందని తీర్పులో వివరించింది. జనరల్ కేటగిరీ సీట్లకు అర్హత ఉన్న రిజర్వేషన్ కోటా అభ్యర్థులు (ప్రతిభావంతులు) సీటు ఎంపిక చేసుకున్నా తిరిగి దానిని వదులుకుని రిజర్వేషన్ సీటులో చేరితే.. వదులుకున్న సీటును ప్రతిభావంతులైన సంబంధిత రిజర్వుడు కేటగిరీ వారితోనే భర్తీ చేశారని హైకోర్టు తీర్పులో పేర్కొంది. రెండో కౌన్సెలింగ్ చట్ట వ్యతిరేకంగా చేయడం వల్ల తర్వాత సీటు వస్తుందో రాదోనన్న భయంతో రిజర్వేషన్లో సీట్లను రిజర్వేషన్ కేటగిరీలోని మెరిట్ అభ్యర్థులు ఎంచుకున్నారని, ఫలితంగా వారంతా ప్రతిభ ఆధారిత ఓపెన్ కోటా సీట్లను నష్టపోయారనే వాదనలో పస లేదని వెల్లడించింది. ఒకసారి సీటు ఎంచుకున్నా ఆ తర్వాత ఖాళీ అయ్యే వాటిని రెండో కౌన్సెలింగ్లో భర్తీ చేస్తామని, చట్ట ప్రకారమే చేశామని వర్సిటీ వాదనను సమర్ధించింది. ఫస్ట్ కౌన్సెలింగ్లో 2047 సీట్లు భర్తీ చేస్తే అందులో 804 ఓపెన్ కోటా, 1243 సీట్లు రిజర్వేషన్ కోటాలో భర్తీ అయ్యాయి. ప్రతిభ ఉన్న రిజర్వుడు కోటాకు చెందిన 440 మంది ఓపెన్ కోటాలో అర్హత పొందారు. అయితే అందులో 20 మందే సీట్లు పొందితే 420 మంది తమ తమ రిజర్వేషన్ కోటాల్లోని సీట్లలో చేరారు. సెకండ్ ఫేజ్ తర్వాత మొత్తం 2487 సీట్లను భర్తీ చేశారు. ఇవన్నీ అయ్యాక వర్సిటీ ఇచ్చిన లెక్కలు చూస్తే.. 1663 సీట్లు రిజర్వేషన్, 824 సీట్లు ఓపెన్ కోటాలో భర్తీ జరిగాయి. మొత్తంగా చూస్తే 1800 సీట్లు రిజర్వుడు అభ్యర్థులకు దక్కితే, 687 సీట్లు ఓసీలకు వచ్చాయి. ఓపెన్ కోటా సీట్లకు అర్హత పొంది సీట్లును మాత్రం రిజర్వేషన్ కోటాలో 420 మంది ఎంపిక చేసుకున్నప్పటికీ వాళ్లు వదిలిన సీట్లను ప్రతిభ ఆధారిత రిజర్వుడు అభ్యర్థులతోనే భర్తీ చేయడం జరిగింది. ఏ రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థికీ నష్టం జరగలేదు. అందుకే రిట్లను డిస్మిస్ చేయడం జరుగుతోంది.. అని డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది.