Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరడిగొండ
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతంలో పడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బాసర మండలం గౌడాపూర్కు చెందిన కురులే శ్రీకాంత్(22) సోమవారం 11 మంది స్నేహితులతో కలిసి కుంటాల జలపాతానికి వచ్చాడు. అందులోకి దిగిన శ్రీకాంత్ కాలుజారి గల్లంతయ్యాడు. స్నేహితులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. ఎస్ఐ భరత్కుమార్ తన సిబ్బందితో ఘటనాస్థలానికి వచ్చి, గజ ఈతగాళ్లతో గాలించారు. రాత్రి సమయంలో శ్రీకాంత్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు.