Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏపీఆర్పీఏ ప్రకటన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఈనెల 21న జరిగే సమావేశం ఎజెండాలో ఈపీఎస్-1995 పింఛన్ సవరణ అంశాన్ని చేర్చకపోవడాన్ని తెలంగాణ ఆల్ పింఛనర్లు, రిటైర్డ్ పర్సన్ల అసోసియేషన్ (టీఏపీఆర్పీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు టీఏపీఆర్పీఏ అధ్యక్షులు పి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ చర్యలకు నిరసనగా ఈనెల 21న రాష్ట్రవ్యాప్తంగా ఈపీఎస్ పింఛనర్లు నల్లబ్యాడ్జీలు ధరించి ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించాలని తెలిపారు. కార్మిక శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. హై ఎంపవర్డ్ మానిటరింగ్ కమిటీ నివేదిక సమర్పించిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి ప్రకటించారని తెలిపారు. త్వరలోనే సీబీటీ సమావేశమై ఆ నివేదికను పరిశీలించి నిర్ణయాలు చేస్తుందని ఫిబ్రవరిలో వెల్లడించారని పేర్కొన్నారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా ఈనెల 21న సీబీటీ సమా వేశం జరుగుతోందని తెలిపారు. కానీ ఆ సమావేశం ఎజెండాలో హై ఎంపవర్డ్ మానిటరింగ్ కమిటీ నివేదిక, ఈపీఎస్ పింఛన్ సవరణలు చేర్చకపోవడం దేశవ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది ఈపీఎస్ పింఛన ర్లను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. కేంద్ర కార్మిక మంత్రి ప్రకట నలకు, ఆచరణకు సంబంధం లేకపోవడాన్ని నిరసిస్తున్నామని తెలిపారు.