Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయం కోసం భర్త ఇంటి ఎదుట ధర్నా
నవతెలంగాణ - సత్తుపల్లి
రెండేండ్లు ప్రేమ పేరుతో నమ్మించాడు. మతం మార్పించి మరీ పెండ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నిరోజులకే మొహం చాటేయడంతో బాధితురాలు న్యాయం కోసం భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లికి చెందిన ఖుర్షీద్, అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామానికి చెందిన బాణోత్ పద్మజను ప్రేమ పేరిట రెండేండ్లు వెంటపట్టాడు. శారీరకంగా లోబర్చుకున్నాడు. ఎనిమిది నెలల క్రితం పద్మజ వేరే మతమనీ, మతం మార్చుకుంటే తప్పకుండా పెండ్లి చేసుకుంటానని ఖుర్షీద్ అన్నాడు. ఆమె సరే అనడంతో హైదరాబాద్లో ఓ మత పెద్ద వద్ద ఫరీనాగా పేరు మార్చి పెండ్లి చేసుకున్నాడు. అప్పట్నుంచి హాస్టల్లోనే ఉంచి క్యాబ్డ్రైవర్గా కాలం వెళ్లదీస్తూ వచ్చాడు. ఇంట్లో నచ్చజెప్పి కాపురానికి తీసుకెళ్తానని రెణ్నెల్లుగా నమ్మిస్తున్నాడు. అనుమానం వచ్చిన యువతి ఖుర్షీద్ ఇంటికి వెళ్లగా అత్తామామలులోనికి రానివ్వలేదు. బోరుమన్న బాధితురాలు తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని విలపించింది. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ సురేశ్ విచారణ చేపట్టారు.