Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఆరోగ్యశ్రీ' సేవలపై కేసీఆర్కు పట్టింపేది?: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి
నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
తెలంగాణలో బీజేపీ పాగా వేయడం అసాధ్యమని, అది బీజేపీ పగటి కల అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలకిచ్చిన విభజన హామీలు నెరవేర్చడంలోనూ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అలాంటి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకోరని, ఇక్కడివారు చైతన్యవంతులని అన్నారు. పాలకుల, అధికారుల అక్రమాలకు, అవినీతికి మూకుతాడు వేసే ఆర్టీఐని నిర్వీర్యపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థను కోరుకున్న సీఎంలు కేసీఆర్, జగన్ కేంద్ర నిర్ణయాలకు మద్దతు తెలపడం దుర్మార్గమన్నారు. విభజన హామీలోని గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయకపోయినా కేసీఆర్ కేంద్రం తెచ్చిన బిల్లులకు మద్దతు తెలిపారని విమర్శించారు. రాష్ట్రంలో పేదలు 'ఆరోగ్య శ్రీ' సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రయివేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను పిలిచి సత్వరమే పేదలకు 'ఆరోగ్య శ్రీ' సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని లేకుంటే టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుందని హెచ్చరిం చారు. విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల మీద దృష్టి సారించాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కో-కన్వీనర్ పొనగంటి కేదారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కూన శోభారాణి, గూడెం లక్ష్మి, సృజన్కుమార్ పాల్గొన్నారు.