Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమంత్రి ఆరోపణలు అవాస్తవం: వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ నేతలు చక్రవర్తులు కారు .. తెలంగాణ వారికి సామంత రాజ్యం కాదు. రూపాయి ఇచ్చింది లేదు .. పండుగకు, పబ్బానికీ చుట్టపుచూపులా వస్తున్న వారు రాళ్లు విసిరి పోతున్నారు. బీజేపీ నేతలకు సిగ్గుండాలి అంటూ బీజేపీ కార్యనిర్వాహాక అధ్యక్షులు నడ్డాపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎస్. నిరంజన్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్లోని టూరిస్టు ప్లాజా హౌటల్లో జరిగిన తెలంగాణ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన వ్యవసాయ పనిముట్లు, యంత్రాలపై రైతు మార్గదర్శి పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న మంత్రి కేంద్రపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. దేశానికి దారిచూపే పథకాలను తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్నదని పేర్కొన్న నితి ఆయోగ్ రూ. 24 వేల కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. కనీసం ఒక్క రూపాయి ఇవ్వడం చేతకాని వాళ్లు విమర్శించడం సిగ్గుచేటు. కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలలో పూర్తి చేసి రైతులకు నీళ్లందిస్తుంటే, కేంద్రంలోని ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు .. కానీ బీజేపీ నేతలు నీతిమాలిన ఆరోపణలతో తెలంగాన ఖ్యాతిని తగ్గించాలని చూస్తున్నారని విమర్శించారు. మారుతున్న నేటి ఆధునిక వ్యవసాయ విధానాలను రైతులు అవగాహణ చేసుకొని తక్కువ వ్యయంలో ఎక్కువ ఉత్పత్తిని సాదించాలని సూచించారు. ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాల సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించేందుకు త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సదస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో వ్యవసాయ కూలీల కొరత నేపథ్యంలో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని కేంద్రానికి పలు మార్లు విజ్ఞప్తి చేసినా ఇంత వరకు సమాదానం లేదని విమర్శించారు. ఆగ్రోస్ చైర్మెన్ లింగంపల్లి కిషన్రావు మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్దతులను రైతులకు చేరువ చేసేందుకు కార్పొరేషన్ కృషి చేస్తున్నదని అన్నారు. వ్యవసాయ పనిముట్లు, యంత్రాలపై ఎస్సీ, ఎస్టీలకు 95శాతం సబ్సీడీ, బీసీలకు 50శాతం సబ్సీడీ అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ ఎండీ సురెందర్రెడ్డి, మేనేజర్ రాజమోహన్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త సుధాకర్రెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన రైతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.