Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్గా రఘునందన్రావు బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన రాజేశ్వర్ తివారీని బదిలీ చేస్తూ ఆయన స్థానంలో సోమేశ్ కుమార్ను, పంచాయతీరాజ్ కమిషనర్ నీతుకుమారి ప్రసాద్ను బదిలీ చేసి ఆమె స్థానంలో రఘునందన్రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నూతన రెవెన్యూ చట్టం తేనున్న నేపథ్యంలో నీటి పారుదల శాఖ, వాణిజ్య పన్నులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సోమేశ్ కుమార్ను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. గత కొంత కాలంగా పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న రఘునందన్రావును పంచాయతీరాజ్ కమిషనర్గా నియమించింది. రఘునందన్రావు హైదరాబాద్ కలెక్టర్గా చేస్తూ ప్రత్యేక కోర్సు కోసం అమెరికా వెళ్లిన విషయం విదితమే చాలాకాలం కిందటే కోర్సు పూర్తి చేసుకొని ప్రభుత్వానికి రిపోర్టు చేసినప్పటికీ ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. తాజా గా పంచాయతీరాజ్ చట్టంలో కీలక మార్పులను ప్రతిపాదించిన ప్రభుత్వం, ఆ సంస్కరణలన్నీ గట్టిగా అమలుచేయాలంటే బలమైన అధికారి కావాలనే ఉద్దేశం తో రఘునందన్ రావును ఎంపిక చేశారు.ఇదిలా ఉండగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సోమేశ్కుమార్ను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.నారాయణ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ శాఖను పటిష్ట పరిచేందుకు తగిన సంస్కరణలు చేయాలని, ప్రజలకు మరింత సులువుగా సేవలందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.