Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ నర్సింగ్ సమితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎన్ఎంసీ బిల్లును స్వాగతిస్తున్నట్టు తెలంగాణ నర్సింగ్ సమితి (టీఎన్ఎస్) తెలిపింది. సమతి ఆధ్వర్యంలో సోమవారం నగరంలో నిర్వహించిన సమావేశంలో సమితి వ్యవస్థాపక అధ్య క్షులు కురు మేటి గోవర్థన్, అధ్యక్షులు ధనుంజరు కంపాటి, ప్రధాన కార్యదర్శి ఏడపల్లి సురేష్ తదితరులు పాల్గొని ప్రసంగిం చారు. బీ.యస్సీ (నర్సింగ్), యం.యస్సీ (నర్సింగ్) చేసిన వారికి 6 నెలల పాటు బ్రిడ్జి కోర్సులో శిక్షణ ఇస్తే ఆరోగ్య రంగంలో గుణాత్మక మార్పులు వస్తాయన్నారు. అభివ ద్ధి చెందిన దేశాల్లో నర్సులు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు (ఎం.ఎల్.హెచ్.పీ)లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. బ్రిడ్జి కోర్సు తర్వాత గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. సమావేశంలో టీఎన్ఎస్ జిల్లా నాయకులు, ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల నర్సులు పాల్గొన్నారు.