Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటర్ ట్యాంక్ ఎక్కి యజమానుల నిరసన
నవతెలంగాణ - తిమ్మాపూర్
మిషన్ భగీరథ ప్రాజెక్టు కాంట్రాక్టర్ తమకు బిల్లులు చెల్లించడం లేదని ఆ ప్రాజెక్టు పరిధిలో పనిచేసిన వాహనాల యజమానులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎమ్డీ కాలనీలో సోమవారం జరిగింది. ఆవేదనతో ఒకరు ఒంటిపై డీజిల్ పోసుకున్నాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 'మిషన్ భగీరథ' కాంట్రాక్టర్, మ్యాక్స్ ఇన్ ఫ్రా అధికారులు తమతో పని చేయించుకుని బిల్లులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు కంపెనీ వారు ట్రాక్టర్ నుంచి జేసీబీ వరకు సుమారు 80 వాహనాలతో పనులు చేయించుకుని రూ.2 కోట్లా 65 లక్షల వరకు బిల్లులు ఇవ్వలేదని బాధితులు వాపోయారు. విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ అధికారులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. బిల్లులు త్వరలో చెల్లిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.