Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేషెంట్ మృతి, ముగ్గురికి గాయాలు
నవతెలంగాణ-శంకర్పల్లి
అంబులెన్స్ అదుపు తప్పి బోల్తా పడి మహిళ మృతిచెందింది. ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం హుస్సేన్పూర్ చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలంలోని తంగళ్లపల్లి గ్రామానికి చెందిన మదునపల్లి జంగమ్మ(65)కు ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆదివారం రాత్రి శంకర్పల్లికి తీసుకొచ్చారు. వైద్యుల సూచనల మేరకు అంబులెన్స్లో వికారాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో జంగమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.