Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
- మల్కాజిగిరి ప్రభుత్వాస్పత్రిలో సర్వే
నవతెలంగాణ - మల్కాజిగిరి
ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి కోరారు. సోమవారం హైదరాబాద్ మల్కాజిగిరి ప్రభుత్వాస్పత్రిలో ఐద్వా బృందం సర్వే చేపట్టి రోగుల ఇబ్బందులను తెలుసుకుంది. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రిలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. 50 పడకలున్న ఆస్పత్రిలో 100 మంది రోగులు వస్తున్నారని, అయినా పడకలు పెంచడం లేదన్నారు. ఆస్పత్రిలో 20 మంది నర్సులకు 9 మంది మాత్రమే ఉన్నారన్నారు. మలేరియా, డెంగ్యూ వచ్చిన వారికి పరీక్షలు చేసేందుకు సరైన పరికరాలు లేవన్నారు. ఆస్పత్రుల్లో స్కానింగ్, ఎక్స్్రే పరికరాలను అందుబాటులోకి తీసుకురావాన్నారు. హాస్పిటల్ బిల్డింగ్ను మేడ్చల్ జిల్లాకు హ్యాండోవర్ చేయకుండా కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగానే పరిగణిస్తున్నారన్నారు. నాలుగో తరగతి కార్మికులకు ఆరు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యమందాలనే ఉద్దేశంతో ప్రభుత్వాస్పత్రుల్లో సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల వినోద, జిల్లా నాయకురాలు అన్నపూర్ణమ్మ, ఆలేఖ్య, హేమలత, కళావతి, బేగం పాల్గొన్నారు.