Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27న విద్యాసంస్థల బంద్కు సంపూర్ణ మద్దతు :
టీజేఎస్ అధ్యక్షులు ప్రొ. కోదండరామ్
నవతెలంగాణ-పంజాగుట్ట
నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ లెక్చరర్ల జేఏసీ ఆధ్వర్యంలో 'బంద్' వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ సంస్థ అయినా, ప్రభుత్వమైనా చట్టానికి లోబడి పని చేయాలి.. కానీ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ధన సంపత్తికి లోబడి పని చేస్తోందని విమర్శించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో లెక్చరర్ల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన కేసీఆర్.. అనంతరం వారి సమస్యలను పెడచెవిన పెట్టారన్నారు. ఈ నెల 27న తెలంగాణ లెక్చరర్స్ జేఏసీ చేపట్టనున్న విద్యాసంస్థల బంద్కు టీజేఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జానకిరెడ్డి, భాస్కర్రెడ్డి, విల్సన్, చంద్రశేఖర్, బీజేపీ నాయకులు శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.