Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో - హైదరాబాద్
సత్వర న్యాయానికి, వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వ పద్దతులు మేలని మిషన్ భగీరధ విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్రెడ్డి అన్నారు. ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్ట్రనేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ (ఐ.సీ.ఏ.డీ.ఆర్) ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార పద్ధతులు, ఇటీవల వచ్చిన సవరణలపై రెండు రోజులు వర్క్షాపు సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వంతో వివాదాలు సకాలంలో పరిష్కారమై అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయన్నారు. బహుళజాతి సంస్థలతో చేసుకున్న ఒప్పందాల్లో అనేక వివాదాలు తలెత్తె అవకాశముందనీ, ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార పద్దతులపై అవగాహన కలిగి ఉండడం అవసరమన్నారు. మధ్యవర్తిత్వం నిర్వహించే ఆర్బిట్రేటర్లు తప్పనిసరిగా నిష్పాక్షికంగా, తటస్థంగా ఉండాలన్నారు. భారత రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీఏడీఆర్ ప్రాంతీయ ఇన్చార్జి, కార్యదర్శి జె.ఎల్.ఎన్.మూర్తి, నీరు, పారిశుధ్య మిషన్ ఛీఫ్ ఇంజినీర్ వినోబాదేవి, మిషన్ భగీరథకు చెందిన ఇంజినీర్లు పాల్గొన్నారు.