Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపండి : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ-కూకట్పల్లి
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా.. పచ్చి అబద్ధాల అడ్డా.. అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లోని కూకట్పల్లి ఎన్గార్డెన్స్లో ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల విస్తతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులకు నచ్చడం లేదన్నారు. కర్నాటక రాజకీయాలు తెలంగాణలో చేద్దాం అనుకుంటే.. తెలంగాణ బిడ్డలు మీ ఆటలు సాగనివ్వరని హెచ్చరించారు. మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందాలని బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్ ఎక్కడ ఉందో చూపించాలన్నారు. కోటి ఎకరాలకు సాగు నీటిని అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనడం హాస్యాస్పదమన్నారు. ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపెట్టాలని సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రూ.2000 పింఛన్ పథకం లేదని చెప్పారు. సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరవాత హైదరాబాద్ నగరంలో ఒక్క కర్ఫ్యూ లేదని, 144 సెక్షన్ లేదని చెప్పారు. గత పాలకుల కాలంలో నగరంలో ఎప్పుడూ అల్లర్లు, ఘర్షణలు జరిగేవని అన్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఏవో గొడవలు సష్టిద్దామని కొందరు చూస్తున్నారని విమర్శించారు. వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో గతంలో ఏడు రోజులకోసారి తాగు నీళ్లు వచ్చేవని, ఇప్పుడు రోజు విడిచి రోజు వస్తున్నాయని తెలిపారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీలు నవీన్రావు, శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.