Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నడ్డాకు విజయశాంతి సవాల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై విచారణకు ఆదేశించినట్టుగానే...కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి, వాస్తవాలను వెలుగు లోకి తేగలిగే దమ్ముందా? అని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయల నిధులను స్వాహా చేసిందని నడ్డా చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలనీ,...దమ్ముంటే అవినీతిపై ఆధారాలు చూపించాలని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ విసరిన సవాల్కు సిద్ధమేనా అని అన్నారు. వాస్తవాలు బహిర్గతం కావాలంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఈ సవాల్ విసిరే ముందు తన తండ్రి కేసీఆర్ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలకు గ్లోబరీనా సంస్ధ నిర్లక్ష్యమే కారణమనీ, గ్లోబరీనా సంస్ధకు టీఆర్ఎస్ పెద్దలంతో సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షనేతలు ఆరోపించినప్పుడు కూడా కేటీఆర్ ఇదే రకంగా అన్నారని ఆమె గుర్తు చేశారు.