Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈనెల 24న హైదరాబాద్లోని పబ్లిక్గార్డెన్లో ఫోరమ్ ఫర్ సోషల్ జస్టీస్ ఆధ్వర్యంలో ఇండియన్ కమ్యూనిజం, సామాజికన్యాయంపై సెమినార్ నిర్వహిస్తున్నట్టు ప్రొఫెసర్ కంచ ఐలయ్య తెలిపారు. బుధవారం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, ఎంసీపీఐ(యూ) ప్రధాన కార్యదర్శి ఎండి.గౌస్తో కలిసి సెమినార్ పోస్టర్ను ఆ పార్టీ కార్యాలయంలోఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. దేశంలో కమ్యునిస్టు పార్టీల ఐక్యత చారిత్రక అవసరమని తెలిపారు. సామాజికన్యాయం జరగాలంటే కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మత ప్రేరిత సామాజిక, ఆర్థికవిధానాలను ఎండగట్టాలంటే ఐక్య ఉద్యమాలు తప్ప మరో మార్గం లేదని వివరించారు.రిజర్వేషన్లు అవసరం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్భగవత్ ప్రకటించడం వెనక భారీ కుట్ర ఉందని విమర్శించారు. 70 ఏండ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన సామాజిక తరగతులకు వెన్నుదన్నుగా ఉన్న రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. కాగా ఈ సెమినార్కు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.