Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్కు పీఆర్టీయూటీఎస్ నోటీసు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వచ్చేనెల ఒకటిన సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని పీఆర్టీయూటీఎస్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని బుధవారం హైదరాబాద్లో పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు కలిసి నోటీసు అందజేశారు. 2018, మే 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలుకు ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకొని 2018, జూన్ 2 నుంచి అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వా లని పేర్కొన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలిపారు. ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 61ఏండ్లకు పెంచాలని కోరారు. ఏకీకృత సర్వీసు నిబంధ నల విషయంలో న్యాయపరమైన చిక్కులను తొలగించి ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు. ఆలస్యమైతే యాజమాన్యాల వారీగా ఉద్యోగోన్నతులు ఇవ్వాలని సూచించారు. పండితులు, పీఈటీల అప్గ్రెడేషన్ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని తెలిపారు. రూ.398 వేతనంతో పనిచేసిన ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని పేర్కొన్నారు. అంతర్జిల్లా బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని తెలిపారు.