Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ విద్యార్థుల మరణాలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోకుండా న్యాయం చేయాలని ధర్నా చేసిన విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు టీవీవీ అధ్యక్షులు అధ్యక్షులు మద్దిలేటి, ప్రధాన కార్యదర్శి సందీప్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ధర్నా చేయడమే నేరమైతే విద్యార్థుల మృతికి కారణమైన విద్యాశాఖ, గ్లోబరీనాపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని తెలిపారు.