Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎన్నికల నిర్వహణ ఖర్చుల లెక్క తప్పిందంటూ ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్పై అనుమానం వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం పంపిన డబ్బును కొంత మంది నేతలు దాచుకున్నారన్న సమాచారంతో అధిష్టానం ఆరా తీసినట్టు నేతలు గుసగుసలు లాడుకున్నారు. లెక్కలు చెప్పాలంటూ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్తం ఎన్నికల నిర్వహణ కోసమే ఖర్చు పెట్టినట్టు అభ్యర్థులంతా అధిష్టానానికి లెక్క చెప్పాలని రాష్ట్ర నాయకత్వం అభ్యర్థులకు ఫోన్లు చేసినట్టు ఒక ఎంపీ అభ్యర్థి మీడియాకు లీకిచ్చారు.
లోక్సభ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై ఢిల్లీలో సమీక్ష జరగనుంది. జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు, వాహనాలకు ఖర్చులకు ఉపయోగించాల్సిన డబ్బును పక్కదారి పట్టించినట్టు అధిష్టానం మండిపడినట్టు తెలిసింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో కలత చెందిన కొంత మంది నేతలు ఇదే అంశంపై అధిష్టానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిని అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ఏం చేశారో లెక్కలు చెప్పాలంటూ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయమై ఏఐసీసీ ఎన్నికల కమిటీ నుంచి ఫోన్ కాల్స్ వస్తే, ఆ మొత్తాన్ని ఎన్నికల నిర్వహణ కోసం ఖర్చు చేశామని చెప్పాలంటూ రాష్ట్ర నాయకత్వం అభ్యర్థులను కోరుతున్నట్టు పార్టీ నేతలు అంటున్నారు. దీనిపై స్వయంగా సోనియాగాంధీనే దృష్టి సారించడంతో నేతల్లో ఆందోళన నెలకొంది.