Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని పరిస్థితి విషమించి మరణించింది. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామయ్యపల్లి గ్రామానికి చెందిన మడికొండ దంపతులు రవీందర్రావు, ప్రేమలతకు ఇద్దరు కుమార్తెలున్నారు. చిన్న కుమార్తె రుచిత(17) హన్మకొండలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఫస్టియర్ పరీక్షల్లో రుచిత ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఇటీవల రాఖీ పౌర్ణమి సందర్భంగా కళాశాల నుంచి ఇంటికొచ్చిన ఆమె ఈ నెల 19న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా పరిస్థితి క్షీణించడంతో బుధవారం తెల్లవారుజామున మృతిచెందింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు.