Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ డిమాండ్లతో ఈనెల 27న చలో బస్భవన్ ఆందోళనా కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నట్టు టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, కె రాజిరెడ్డి తెలిపారు. మంగళవారం నాడిక్కడి మగ్దూం మినీహాల్లో చలో బస్ భవన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈసందర్భంగా మాట్లా డుతూ ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్టీసీని ప్రభు త్వంలో విలీనం చేస్తూ 2013 అక్టోబర్ 11న జీవోఆర్టీ నెంబర్ 961ని అప్పటి ప్రభుత్వం విడుదల చేసిందని, కానీ దాన్ని అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నదని అన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై పనిభారాలు తీవ్రంగా ఉన్నాయని, వాటిని భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.