Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఏఐ డీజీఎం అమిత్కుమార్
- ఆదిలాబాద్, నిజామాబాద్లో స్థల పరిశీలన
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్/ జక్రాన్పల్లి
రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సం బంధించి ఆరు నెలల్లో పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్) అందజేస్తామని ఏఏఐ డీజీఎం అమిత్కుమార్ తెలి పారు. బుధవారం ఏఏఐ(ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారుల బృందం ఆదిలాబాద్, నిజా మాబాద్ జిల్లాల్లో పర్యటించింది. మొదట ఆదిలా బాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న డీజీఎం అమిత్ కుమార్, ఏజీఎం నీరజ్ గుప్తకు జడ్పీ చైర్మెన్ రాథోడ్ జనార్ధన్, ఎంపీ సోయం బాపురావు స్వాగతం పలికారు. అనంతరం మైదానానికి వెళ్లి పరిశీలిం చారు. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లిలో పర్య టించారు. విమానాశ్రయ నిర్మాణానికి జక్రాన్పల్లి మండలంలో ప్రతిపాదించిన స్థలం అనుకూలంగా ఉందని తెలిపారు. అంతకుముందు ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే గోవర్ధన్ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతిపాదిత మ్యాప్ ఆధారంగా మండలంలోని మనోహరాబాద్ శివారులో గల సాయిబాబా ఆలయం నుంచి తొర్లికొండ వైపు నడుచుకుంటూ కిలోమీటర్ వరకు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం గ్రీన్ఫీల్డ్ కింద 3 విమానాశ్రయాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు.