Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: స్త్రీ శిశుసంక్షేమశాఖ డైరెక్టర్కు అంగన్ వాడీ వర్కర్స్ (టీచర్స్), హెల్పర్స్ యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అంగన్వాడీలు తమ హక్కుల కోసం నిరసన చేపట్టినÛందుకు వేతనాలు కట్ చేయాలనీ ప్రభుత్వం తీసుకొచ్చిన సర్క్యూలర్ 1357లోని నిబంధలను వెంటనే తొలగించాలనీ తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.పద్మ, ప్రధానకార్యదర్శి పి.జయలక్మి, ఉపాధ్యక్షులు ఎం.మీనా డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్త్రీ శిశుసంక్షేమశాఖ డైరెక్టర్కు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అంగన్వాడీలు చేసిన 13 రోజుల సమ్మెకు అప్పటి ప్రభుత్వం వేతనాలు చెల్లించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ఉద్యోగానికి భద్రత కరువయిందని ఆరోపించారు. డిమాండ్ల సాధనకు ప్రజాస్వామ్య బద్దంగా తాము నిరసన చేపట్టితే తమ హక్కులకు భంగం కల్గే చర్యలకు ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. అనేక ఏండ్లుగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఉద్యోగ భద్రతను కాలరాస్తూ తెచ్చిన జీవో నెంబరు 14ను, పెన్షన్ లేకుండా తీసుకొచ్చిన జీవో నెంబరు 19ని, అంగన్వాడీ కేంద్రాలను పొదుపు సంఘాలకు అప్పగిస్తూ ఇచ్చిన జీవో నెంబరు 8ని వెంటనే ఉపసంహారించుకోవాలని అన్నారు. అలాగే తొలగించిన12 జాతీయ సెలవు దినాలను పునరుద్ధరించాలని, ఇంక్రిమెంట్, స్టేషనరీ, యూనిఫామ్స్, ఇన్చార్జీ అలవెన్స్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2018 అక్టోబర్ నుంచి పెంచిన జీతాలను వెంటనే అమలు చేయాలని అన్నారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.