Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
వరంగల్రూరల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పెద్దిరెడ్డి నరసింహారెడ్డి (101) అనారోగ్యంతో బుధ వారం మృతిచెందారు. నరసింహారెడ్డి భార్య సుశీలమ్మ గతేడాది కిందటే మరణించింది. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నరసింహారెడ్డి భౌతికకాయానికి సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి, ఎంపీటీసీ గజ్జి ఐలయ్య, మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి స్వర్ణలతరాజిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చిట్టిరెడ్డి జైపాల్రెడ్డి నాయకులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.