Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిశుధ్య పనుల్లో మంత్రి కేటీఆర్
- ప్రగతిభవన్లో శ్రమదానం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తన నివాసంలో దోమల నియంత్రణ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించారు. గ్రేటర్లో దోమల విజృంభణతో వ్యాపిస్తున్న డెంగ్యూ వ్యాధిని నిర్మూలించేందుకు పారిశుధ్య పనుల్లో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా మంగళవారం తను నివసిస్తున్న ప్రగతి భవన్లో నీరు నిలిచే ప్రాంతాలను శుభ్రం చేశారు. పూల కుండీలలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. సంపులో దోమల నివారణకు మందు చల్లారు. పూల మొక్కల పరిసరాలలో శుభ్రంగా ఉండేలా స్వయంగా పనులు నిర్వహించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.