Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యురేనియం పరిశోధనపై ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యురేనియం తవ్వకాలకు అనుమతించలేదని, భవిష్యత్తులో అనుమతించబోమని చెబుతున్న టీఆర్ ఎస్ ప్రభుత్వం యురేనియం నిక్షేపాలను కనుగొనే అన్వేషణకు ఎందుకు అనుమతించిందో చెప్పాలని శాసనమండలిలో టీఎస్ యూటీఎఫ్ ఎమ్మెల్సీ అలు గుబెల్లి నర్సిరెడ్డి ప్రశ్నించారు.మండలిలో ఆదివారం జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా అలుగుబెల్లి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో నిక్షేపాలు కనుగొన్నారా? నిక్షేపాల వెలికితీతకు కేంద్ర ప్రభుత్వం అనుమతిం చిన విషయం రాష్ట్ర ప్రభుత్వం ద ష్టికి వచ్చిందా?, రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించిందా?, అలాంటి వెలికితీతతో జీవ వైవిధ్యానికి ప్రమాదకర మన్న విషయం వాస్తవమా? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు, అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసర్చ్ (ఏఎండీ) నల్లగొండ జిల్లాల్లోని లంబాపూర్, పెద్దగట్టు, చింత్రియాల్లలో 1992 నుంచి 2012 మధ్య కాలంలో యురేనియం అన్వేషణ కోసం సర్వే, తనిఖీని చేపట్టి 18,550 మెట్రిక్ టన్నుల యురేనియం నిక్షేపాలు ఉన్నట్టు కనుగొందన్నారు. అందు కోసం ఏఎండీకి ఆదేశించే హక్కు ఉందన్నారు. అయితే అటవీప్రాంతంలో సర్వే, తనిఖీ కోసం 2009లో నాటి రాష్ట్ర ప్రభుత్వం అను మతించిందన్నారు. మైనింగ్కు చేపట్టవద్దనే షరతు తో 2016లో వన్యప్రాణి బోర్డు సిఫారసు చేసింద న్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో అన్వేషణను చేపట్టలేదని వివరించారు.
అటవీ ట్రాకులను విని యోగించడం కాని, యంత్రాల కదలికల కోసం కొత్త రోడ్లను వేయడం లేదన్నారు. ఉదయం సమయంలో నే అన్వేషణ కొనసాగుతున్నదని, ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దని, చెట్లను నరకడం, కూల్చడం చేయవద్దని షరతు విధించినట్టు చెప్పారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని నర్సిరెడ్డి మళ్లీ మా ట్లాడేందుకు లేచి నిలబడ్డా చైర్మెన్ అనుమతించలేదు.
అన్వేషణ ప్రమాదమే
యురేనియం అన్వేషణతోనూ ప్రమాదం పొంచి ఉందని నర్సిరెడ్డి హెచ్చరించారు. మండలి మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ రేడియో ధార్మి కత కలిగినవి శుద్ధిచేయకపోయినా వెలికితీత సమ యంలోనూ ప్రమాదమేనని అన్నారు. అవి భూగర్భం లో ఉన్నంత కాలమే ఎలాంటి సమస్య రాదని చెప్పా రు. యురేనియం తవ్వకాల కన్నా కొనుగోలు చౌక అని అభిప్రాయపడ్డారు. కొద్దిరోజుల తర్వాత యురేని యంను ఉచితంగా తీసుకెళ్లమంటా యని చెప్పారు. అమెరికా, జపాన్ తదితర దేశాలు అణువిద్యుచ్ఛక్తి వాడకాన్ని తగ్గించుకుంటున్నాయని తెలిపారు.
మళ్లీ సర్వే అవసరమా? : మండలి ఛైర్మెన్
యురేనియంపై ప్రశ్నోత్తరాల సమయంలో మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడారు. గతంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యూసీఐ) అన్వేషణ, సర్వే చేపట్టిందని, ఇందుకోసం ఆ ప్రాంతంలోని రైతులకు ఛత్తీస్ ఘడ్ తీసుకెళ్లి అక్కడ అవగాహన కల్పించారని చెప్పారు. మళ్లీ సర్వే అవసరమా అనే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. యురేనియంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డితో పాటు ఎంఐఎం, టీఆర్ఎస్ సభ్యులు మాట్లాడారు.