Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసన సభలో సీఎం కేసీఆర్
- నేడు తీర్మానం
- అప్పులతో అద్భుతమైన ఆర్థిక ప్రగతి
- ప్రతిపక్షాలకు ఆందోళన అనవసరం
- సబ్ప్లాన్ నిధులను దారిమళ్లించలేదు
- 1.17లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతించబోమని ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్రావు ప్రకటించారు. సోమవారం అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతా మని చెప్పారు. యురేనియం తవ్వకాల గురించి రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎవ్వరికీ ఏలాంటి అనుమతులు ఇవ్వలేదనీ, భవిష్యత్తులో కూడా ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థి తుల్లో నల్లమల అడవులను నాశనం కానివ్వ మన్నారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ని కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విష యాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే ఆంధ్రాలో తవ్వ కాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. రైతాంగా నికి అన్నం పెట్టే కష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజె క్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల కింద ఉండే డేల్టా ప్రాంతాలు కలు షితమయ్యే ప్రమాదముందన్నారు. హైదరా బాద్కు తాగునీటిని కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఈ అంశాలను దృష్టి లో పెట్టుకునే యురేనియం తవ్వకాలకు ఇచ్చేది లేదని అనుమతులు ఇవ్వబోమని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం దీనిపై ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం వినకుం టే అందరం కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
అద్భుతమైన ప్రగతి
''అప్పుల గురించి ప్రతిపక్షాలకు ఆందోళన అనవసరం. ఆగం కావొద్దు.. అప్పుల ఫలితాలు ఎలా ఉంటాయో కనిపిస్తాయి. అప్పులు చేయని రాష్ట్రం, దేశం ఏదైనా ఉందా. కొన్ని రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం పరిధిని పెంచుకోవు. అప్పులు చేయవు. కానీ జపాన్, అమెరికా, చైనా, యూరోపియన్ ఎకానమీ మోడల్. ప్రపంచంలో అతి ఎక్కువగా అప్పులున్న దేశాలుగా అమెరికా, జపాన్ దేశాలున్నాయి. వేల కోట్ల అప్పులున్న ఈ రెండు దేశాలు ప్రపంచాన్ని ఎలా శాసిస్తున్నాయి? ప్రతిపక్షాలకు ఇంకా 60 ఏండ్ల క్రితం నాటి ఆలోచన విధానాలే ఉన్నాయి. అధునాతన పద్ధతులు నచ్చని వాళ్లకు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. రాష్ట్రానికి 21 శాతం మేర అప్పులున్నాయి. ప్రభుత్వం చేసిన అప్పులతో ఏడాదిలో అద్భుతమైన ప్రగతి సాధించి చూపుతాం'' అని సీఎం చెప్పారు. ఆదివారం శాసనసభలో బడ్జెట్పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వాస్తవ స్థితిగతుల గురించి బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పినా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలను ప్రజలకు చేరవేస్తున్నదని విమర్శించారు. రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఆర్థిక మాంద్యంపై అర్థగణాంక శాస్త్రవేత్తలు, జాతీయ అంతర్జాతీయ స్థాయి నిపుణులతో పాటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సలహాదారులుగా పనిచేసిన ఆర్థికవేత్తలు కూడా అనేక విషయాలు వెల్లడిస్తున్నారని తెలిపారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నదనీ, ఈ పరిస్థితుల్లో దేశం ఏం కాబోతున్నదనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నదని వివరించారు. ఏ రాష్ట్రంలో చూసినా దేశ ఆర్థిక ముఖచిత్రం ఎలా ఉండబోతున్నదనే ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక నిపుణుల సూచనలు, సలహాలమేరకే బడ్జెట్ రూపొందించామన్నారు. గత గత ఏడాదిన్నర కాలం నుంచి ఏ త్రైమాసికంలో ఎంత బడ్జెట్ తగ్గిందో ముందే వివరించామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిఏటా పన్నుల రూపంలో రూ. 2.70 లక్షల కోట్లు రాష్ట్రం నుంచి వెళ్లుతున్నాయి, కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 30వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్లు మాత్రమే వస్తున్నాయని గుర్తు చేశారు. అవి కూడా సంక్షేమ పథకాలకు కోసమే ఇస్తున్నారని తెలిపారు.
రాష్ట్రానికి 21 శాతం అప్పులు
రాష్ట్ర ప్రభుత్వానికి 21 శాతం మాత్రమే అప్పులుంటే, కేంద్ర ప్రభుత్వానికి 48 శాతం అప్పులున్నాయి. రాష్ట్రాభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామే కానీ దావత్లు చేసుకోవడానికి కాదన్నారు. సమైక్య రాష్ట్రం నుంచి రూ. 69 వేల కోట్ల అప్పు తెలంగాణపై పడిన విషయాన్ని గుర్తు చేశారు. మార్క్ఫెడ్, సివిల్ సప్లయిస్ లాంటి వాటికి ప్రభుత్వం ఇస్తున్నదనీ, విద్యుత్ డిస్కంలకు కూడా గ్యారెంటీ ఇచ్చామన్నారు. గ్యారెంటీలను అప్పుకింద చూడొద్దని తెలిపారు. అప్పు కూడా గవర్నమెంట్ ఖాతాలోకే వస్తుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఫైనాన్స్ సంస్థకు ఒక్క రూపాయి కూడా డిఫాల్ట్ కాలేదని తెలిపారు. రెండు పంటలతో అప్పు మాయం
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పు కేవలం రెండు పంటలతో తీరుతుందని సీఎం చెప్పారు.ఈ ప్రాజెక్టు కింద 45 లక్షల ఎకరాలు సాగవుతున్నదని తెలిపారు. కాంగ్రెస్ హాయాంలో కొత్త ఆయకట్టు కాదు కదా.. ఉన్న ఆయకట్టు కూడా కొట్టుకుపోయాయని విమర్శించారు.
ఆ మూడింటికి ప్రాధాన్యం
ఆర్థిక మాంద్యం ఉన్నా రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతు బీమా కోసం ఎల్ఐసీతో కుదుర్చుకున్న ఒప్పందంతో అదనంగా రూ.200 కోట్ల భారంపడుతున్నదనీ, ప్రయివేటు కంపెనీల మీద నమ్మకం లేకనే ఎల్ఐసీతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని చెప్పారు.
మళ్లింపు అవాస్తవం
సబ్ప్లాన్ నిధులను మళ్లించామని అబద్ధాలు మాట్లాడుతన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల్లో ఖర్చు పెట్టిన ప్రతీ పైసాకు లెక్కుందని వివరించారు. దళితులను ఆదుకునే విషయంలో తెలంగాణ ఛాంపియన్ కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. దళిత, గిరిజన అభ్యున్నతికి రాజకీయాలకు అతీతంగా పాటుపడాలి. హౌజ్ కమిటీలను వేస్తున్నాం కాబట్టి, తప్పుఒప్పులను సవరించుకుందాం. ఏ శాసనసభ్యుడు కోరినా ప్రతీ అధికారి సమాధానం చెప్పాలని ఆదేశించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం నుంచి దళితుల అభ్యున్నతి మొదలైందన్నారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన సబ్ప్లాన్ చట్టాన్ని ఇంకా పటిష్టం చేశామనీ, సబ్ప్లాన్ నిధులను పైసా కూడా వేరేవాటికి వాడలేదని చెప్పారు. ఐదేండ్లలో ఎస్సీ సబ్ప్లాన్కు కేటాయించిన రూ.54,350 కోట్లకు లెక్కుందని చెప్పారు. ఈ ఏడాది నుంచి ఖర్చు కాని సబ్ప్లాన్ నిధులను వచ్చే ఏడాదికి క్యారీఫార్వర్డ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం
ఉద్యోగాలు కల్పించడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలో పస లేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1.17లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేమని స్పష్టం చేశారు. త్వరలోనే మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
ధర్నాలు ఫ్యాషనయ్యాయి : కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతి విషయానికి ధర్నాలు చేయడం రాజకీయ పార్టీలు, ఇతరులకు ఒక ఫ్యాషన్గా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. సబ్ప్లాన్ నిధులపై చర్చలో భాగంగా సీఎం మాట్లాడుతూ ధర్నాల గురించి ప్రస్తావించారు. ఉదాహరణకు బస్చార్జీలు పెంచితే ధర్నాలు చేస్తారు. వాటి మూలంగా పెంచిన బస్ చార్జీలు ఏ ఒక్కసారైనా తగ్గాయా? ధర్నాల వల్ల పెద్దగా ప్రయో జనం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఎలాంటి ప్రతిష్ట, బేషజాలకు పోకుండా ఉన్న వాస్తవాలను చెబుతున్నానని చెప్పారు.