Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీర్మానాన్ని ఆమోదించిన శాసనమండలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నల్లమలతో సహా ఎక్కడా యురేనియం తవ్వకాలను చేపట్టవద్దని కేంద్రాన్ని కోరుతూ శాసనమండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రవేశపెట్టిన తీర్మానంతో ఏకీభవిస్తున్నట్టు టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి మాట్లాడుతూ తీర్మానంలో అన్వేషణ పదాన్ని కూడా చేర్చాలని కోరారు. అందుకు కేటీఆర్ అటవీయేతర ప్రాంతంలో అన్వేషణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని చెప్పారు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ యురేనియం అన్వేషణ నిలిపివేయాలని కోరాలని సూచించారు. పార్లమెంటులో కాంగ్రెస్ డిమాండ్ చేస్తే టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇస్తారని చెప్పారు.