Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ పోలీసు కానిస్టేబుల్స్ నియామక పరీక్షలకు సంబంధించిన మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కులు తక్షణమే విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఫలితాల విడుదలపై స్పష్టతలేకపోవడంతో ఐదు నెలలుగా అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రయివేట్ హాస్టళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు. 90 వేల మంది నిరుద్యోగ యువతకు సంబంధించిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తక్షణమే జోక్యం చేసుకొని కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్ట్ విడుదల చేయమని డీజీపీ, బోర్డు చైర్మెన్కు ఆదేశించాలని కోరారు.