Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు లక్షల కోట్లు రాయితీలు.. రైతులను విస్మరిస్తారా?
- 26 నుంచి 29 వరకు రైతుల శిక్షణా తరగతులు : తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేరళ తరహా రుణవిమోచన చట్టం అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి జంగారెడ్డి, టి సాగర్ డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు లక్షల కోట్లు రాయితీలు కల్పిస్తున్న సర్కారు అన్నదాతలను మాత్రం విస్మరిస్తున్నాయని విమర్శించారు. ముఖ్యంగా కౌలు రైతులకు 2011 చట్టం ప్రకారం రుణ అర్హతకార్డులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రైతు సమస్యలపై లోతైన అవగాహన కల్పించడానికి రైతులకు రాష్ట్ర వైజ్ఞానిక, శిక్షణా తరగతులను సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ తరగతులకు యువ రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్న వ్యవసాయ రంగానికి తగిన ప్రోత్సాహలు కల్పించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 9లక్షల మందికి పట్టాపాసుపుస్త కాలు ఇవ్వలేదన్నారు. దీంతో వారికి రైతుబంధు, రైతుబీమా,రుణమాఫీ లభించడం లేదని తెలిపారు. కరువు మండలాలను ప్రకటించి సహయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.పోడు, ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, సాగు చేస్తున్న రైతులకూ రైతుబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, యంత్రీకరణ, నూత న వంగడాలు భూమి సారాన్ని బట్టి ఏ పంట వేసుకోవాలో అనే విషయాలను రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని పేర్కొన్నారు.