Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నల్లమల లో యురేనియం అన్వేషణ, తవ్వకాలను వ్యతిరేకిస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 26 వరకు ''నల్లమల మోటార్ సైకిల్ '' యాత్ర చేపట్టనున్నదని సంస్థ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం.విప్లవకుమార్, ఎ.విజరుకుమార్లు తెలిపారు. యురేనియం తవ్వకాలను అనుమతించేది లేదని తెలంగాణ ప్రభుత్వం, శాసనసభలో చేసిన తీర్మానాన్ని గౌరవించి సర్వేలు,తవ్వకాల ఆదేశాలు ఉపసంహరించుకోవాలన్నారు. అభివద్ధి అంటే అణు ఇంధనం, అణు విద్యుత్, అణు బాంబులు కావని వారు గుర్తు చేశారు. అడవులను ధ్వంసం చేయడం ఆపి, మానవుల జీవన ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ అమెజాన్ అయిన నల్లమల.. ఈ నేలకు తగిన ప్రాణవాయువును అందించడంలో ముందుందని తెలిపారు. తెలుగు జాతి ప్రాణప్రదమైన కృష్ణానది నల్లమల పొత్తిళ్ళ నుంచే ప్రవహిస్తూ తాగు,సాగు నీటిని అందిస్తున్నదన్నారు. రాష్ట్రానికి జీవ జీవాలనిచ్చే అడవిని ధ్వంసం చేసే చర్యలు మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నల్లమల నుంచి నల్లగొండ వరకు సాగే ''నల్లమల పరిరక్షణ యాత్రను'' జయప్రదం చేయాని కోరారు.