Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజిలెన్స్ అధికారుల తనిఖీలు
నవతెలంగాణ-మిర్యాలగూడ
జీఎస్టీ ఎగవేతపై సెంట్రల్ విజిలెన్స్ అధికారులు 15 బృందాలుగా ఏర్పడి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలోని 90 రైస్ మిల్లర్లు, కమీషన్ ఏజెంట్ల ఇండ్లల్లో దాడులు చేశారు. కీలకపత్రాలతో పాటు, పెద్దఎత్తున నగదు, కంప్యూటర్ హార్డ్డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ అశోక్, అసిస్టెంట్ డైరెక్టర్ విఠల్ మాట్లాడుతూ.. ధాన్యాన్ని బియ్యంగా మార్చే క్రమంలో వచ్చే తవుడును ఆయిల్ కంపెనీలకు విక్ర యించిన నేపథ్యంలో 5 శాతం పన్నును వ్యాపారులు జీఎస్టీ రూపంలో చెల్లించాలన్నారు. ఆ మొత్తాన్ని ఎగవేసేందుకు కొందరు మిల్లర్లు, కమీష న్ వ్యాపారులు జీఎస్టీ చెల్లించినట్టు నకిలీ బిల్లులు తయారుచేసి దందా కొనసాగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. మిర్యాలగూడలో మూడ్రో జులుగా దాడులు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. తవుడు దందా చేసే వ్యాపారులు, కమీషన్ ఏజెంట్ల వివరాలు సేకరిస్తున్నామన్నారు. 30 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు, వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్టు తెలిపారు. విచారణ పూర్తయ్యాక సమగ్ర వివరాలు ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.