Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించటమే...
- ఈ ధోరణులతో ప్రజాధనం దుర్వినియోగమయ్యే ప్రమాదం
- సర్కారుకు కాగ్ మొట్టికాయలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ సర్కారు ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నదని కంప్ట్రో లర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) అక్షింతలేసింది. మార్చి 2018తో ముగి సిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.280.45 కోట్లకు బిల్లులు సమర్పించలేదని ఆక్షేపించింది. అందువల్ల డ్రా చేసిన సదరు డబ్బును ప్రజావసారాల కోసమే వినియోగించారన్న భరోసాలేదని ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదికలో పేర్కొంది. ఈ మొత్తంలో రూ.244. 39 కోట్లు కేవలం ఆరు డిపార్టుమెంట్లకు చెందినవే ఉన్నాయని తెలి పింది. మరో రూ.81.64 కోట్లు రాష్ట్ర విభజన ముందు కాలానికి సంబం ధించినవేనని పేర్కొంది. వాటిలో కూడా రూ.5.72 కోట్లకు సంబం ధించిన 89 బిల్లులు పదేండ్లకు పైగా సర్దుబాటు కాకుండా ఉన్నాయని కాగ్ వివరించింది. ఇలాంటి ధోరణుల కారణంగా ప్రజాధనం దుర్విని యోగమయ్యే ప్రమాదావకాశాలు పెరుగుతాయని హెచ్చరించింది.
రూ.28,171 కోట్ల అధిక వ్యయం..
రిజర్వు బ్యాంకు నుంచి తీసుకున్న చేబదుళ్ల (రూ.22,922 కోట్లు) కారణంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం రూ.28,171 కోట్ల మేర అధిక వ్యయాన్ని చేసిందని కాగ్ పేర్కొంది. ఉప పద్దు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు లేకుండా రూ.2,218 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసిందని తెలిపింది. అంతేకాకుండా ద్రవ్యపాలన, ప్రణాళిక, సర్వేలు, గణాంకాల గ్రాంటుతోపాటు హోం అడ్మినిస్ట్రేషన్ గ్రాంటులో కూడా అధిక వ్యయాలు పునరావృతమవుతున్నాయని వివరించింది. రాజ్యాంగంలోని 205 అధికరణం ప్రకారం గ్రాంట్లు, అప్రోప్రియేషన్కు మించి చేసిన అధిక వ్యయాలను ప్రభుత్వం శాసనసభ ద్వారా క్రమబద్ధీకరించుకోవటం తప్పనిసరని కాగ్ పేర్కొంది. కానీ 2014-15 నుంచి 2016-17 ఆర్థిక సంవత్సరాలకు గాను కేటాయింపులకు మించి చేసిన రూ.27,346 కోట్ల అధిక ఖర్చును ప్రభుత్వం క్రమబద్ధీకరించుకోలేదని ఆక్షేపించింది.