Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోలీసులకు బెయిల్ ఇచ్చే అధికారం కల్పిస్తున్న సీఆర్పీసీ 41 ఏ ను సవరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి కోరారు. శాసనమండలిలో ఆదివారం ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెట్టిన తెలంగాణ సివిల్ కోర్ట్స్ సవరణ బిల్లు, 2019ను సభఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సంద ర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, న్యాయస్థానాలకు సైతం నాన్ బెయిలబుల్ నేరాల విషయంలో ముందుగా నోటీస్ ఇచ్చి గాని బెయిల్ ఇచ్చే అధికారం లేదన్నారు.
అలాంటిది ఏడు సంవత్సరాలు విచారణలో ఉంటే బెయిలబుల్ కేసుల్లో సైతం బెయిల్ ఇచ్చే అధికారం పోలీసులకు ఉండడం సరికాదన్నారు. దీంతో నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాల్లో కోర్టులకు కొత్తగా పక్కా భవనాల నిర్మాణం కోసం రూ.200 కోట్లు మంజూరు చేయాలన్నారు.