Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ షంషూల్ ఇస్లాం
నవతెలంగాణ రాంనగర్
దేశంలో ప్రధాని మోడీ పాలన హిట్లర్ను తలపిస్తున్నదని ఢిల్లీ యూని వర్సిటీ ప్రొఫెసర్ షంషూల్ ఇస్లాం అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా కళా మండలి అరుణోదయ సాంస్కతిక సమాఖ్య, పాల-రేలా తదితర సంఘాల ఆధ్వర్యంలో సాంస్కతిక ప్రతిఘటన సభ (ప్రదర్శనలు) నిర్వహించారు. ఇస్లాం మాట్లాడుతూ ఇటలీ పాలకుల్లో చూసినా ఫాసిజం అడుగులు నేటి కులం పునాదుల్లో కనబడుతోందన్నారు. ఒకేదేశం ఒకేపన్ను ఒకేఎన్నిక పేరిట బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ఫాసిస్టు వర్గంలోకి తీసుకెళ్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక వాదులు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలపై చేస్తున్న దాడులను విమర్శించే మేధావులను అర్బన్ నక్సలైట్లని జైల్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, పశ్చిమ బెంగాల్ కళాకారులు ప్రదర్శించిన కళా రూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సాంస్కతిక సమాఖ్య నాయకురాలు విమలక్క, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, వీక్షణం సంపాదకులు వేణుగోపాల్, పలువురు నాయకులు పాల్గొన్నారు.