Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ అస్తవ్యస్తమైన పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. మితిమీరిన అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయిం చారని ఆరోపించారు. సుమారు 24వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తున్నదన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం టీఆర్ఎస్ సర్కారు ఏమీ చేయలేదని చెప్పారు. ఏదో సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారని విమ ర్శించారు. ఆదివారం శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై ఆయన మాట్లాడారు. మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దివాళా అంచు ల్లోకి నెట్టిందని విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా చేసిన అప్పులు భవిష్యత్లో రాష్ట్రానికి భారం కానున్నాయని చెప్పారు.
విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా సమ స్యలను తప్పుదారి పట్టించేందుకే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రసంగం చేశారంటూ మండి పడ్డారు. 2019-20 బడ్జెట్లో నిరుద్యోగ భతిపై స్పష్టత లేదనీ, ఎన్నికల హామీలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. ఓటాన్ అకౌంట్ కంటే ఈ బడ్జెట్ను కుదించారని విమర్శించారు.
ఈ సమస్యలను పరిష్కరించండి : శాసనసభలో స్పీకర్కు విజ్ఞప్తి
- రుణమాఫీ సమస్య తీవ్రంగా ఉంది. వడ్డీలు పెరిగిపోతున్నాయి. బంగారు రుణాలకు రుణమాఫీ చేయాలని జీవో ఉంది.
- మున్సిపల్ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి. సమానపనికి సమాన వేతనం రూ 18వేలు ఇవ్వాలి.
- ఈము రైతులకు తీవ్ర నష్టం జరిగింది.రుణాలు చెల్లించలేకపోతున్నారు.ఇప్పటికే సర్కారు ఈమ్ రైతులు లేఖలు రాశారు.
- పదేండ్లుగా హోంగార్డుల పని చేస్తున్న వారిని ఏ కారణం లేకుండా తొలగించారు. వారిని ఆదుకోవాలి.
- ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫెలోషిప్ రావడం లేదు. మెస్చార్జీలు ఇవ్వడం లేదు.
- వ్యవసాయ శాఖలో డ్రీప్ ఇరిగేషన్, స్పింక్లర్లు, పాలీహాస్లకు డబ్బులు ఇవ్వడం లేదు.
- పాల ఉత్పత్తిదారులకు నాలుగు రూపాయల ప్రోత్సాహకాలు వెంటనే అందించాలి
- ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా సంస్థను మళ్లీ బ్లాక్లిస్ట్ పెట్టాలి.
- కూకట్పల్లి మండలంలో శంషీర్పూర్ గ్రామంలో సర్వే నెంబర్ 52లో దళితులు నివసిస్తున్న భూములను స్థానిక పెద్దలు అన్యాక్రాంతం చేస్తున్నారు.
- కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలి
- సబ్ప్లాన్ నిధులు దారిమళ్లుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
- దళిత, గిరిజన విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్నామంటూ టీఆర్ఎస్ సభ్యులు పదే పదే చెప్పి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు.