Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1.49 లక్షల పోస్టుల భర్తీకి అనుమతి
- ఉద్యోగ సంఘాలతో చర్చించి పీఆర్సీపై నిర్ణయం
- మాంద్యం వల్లే సీడీపీ నిధులివ్వడం లేదు
- రాష్ట్రానికి రూ.1.57 లక్షల కోట్ల అప్పు : మండలిలో మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 1,17,714 మందికి కొలువులిచ్చామని ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్రావు చెప్పారు. ఆదివారం శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 1,49,382 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చిందని చెప్పారు. టీఎస్పీఎస్సీ ద్వారా 26,481, డీఎస్సీల ద్వారా 10,978, పోలీసు, గురుకులాల బోర్డు, మెడికల్ బోర్డు, ఆర్టీసీ, విద్యుత్, సింగరేణిలో కలిపి మొత్తం 1,17,714 మందికి ఉద్యోగాలిచ్చామని అన్నారు. టీఎస్పీఎస్సీకి ఇప్పటి వరకు 39,912 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చామని వివరించారు. వాటిలో 26,481 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. 13,401 ఉద్యోగాలు నియామక దశలో
ఉన్నాయని చెప్పారు. 5,816 ఉద్యోగాలు కోర్టులో పరిధిలో పెండిం గ్లో ఉన్నాయని వివరించారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి పీఆర్సీ అమలు, ఉద్యోగ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసుకుంటా మన్నారు. నిరుద్యోగభృతి ఏ ప్రాతిపదికన ఇవ్వాలో ప్రభుత్వం పరిశీలి స్తోందని చెప్పారు. విశ్వవిద్యాలయాల వీసీల నియామకానికి సెర్చ్కమి టీలు నియమించామన్నారు. బీజేపీ నాయకుల వల్లే వర్సిటీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ కావడం లేదని అన్నారు. రాష్ట్రంలో పథకాలు బాగున్నాయి కాబట్టే కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారని చెప్పారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్లో గల 40 మంది సర్పంచ్లు కేసీఆర్ను కలిసి ఆ గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరారని గుర్తు చేశారు. ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని, త్వరలోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పారు. 94శాతం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తయిందన్నారు. మిగి లిన 6శాతం పూర్తి చేసేందుకు రెవెన్యూ, అటవీ, ఎండోమెంట్, వక్ఫ్బోర్డు లతో కలిపి జాయింట్ సర్వే చేపడతామని అన్నారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీల డబ్బు చెల్లిస్తామని చెప్పారు. ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే అప్పులు తెస్తున్నామని అన్నారు. 13 రాష్ట్రాలు జీఎస్డీపీలో 20 శాతం కంటే ఎక్కువ అప్పులు తెచ్చాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జీఎస్డీపీలో 20.04 శాతం అప్పు తెచ్చిందన్నారు. 2014-15 నాటికి రాష్ట్రంలో రూ.75,577 కోట్ల అప్పుందని అన్నారు. ప్రస్తుతం రూ. 1,57,351 కోట్ల అప్పుంటే, రూ.29,198 కోట్లు చెల్లించామన్నారు. ఇప్పుడు రూ.1,28,153 కోట్ల అప్పు ఉందని చెప్పారు. అభివృద్ధి కోసమే అప్పులు తెస్తామని మాజీ ఆర్థిక మంత్రి రోశయ్య అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చినపుడు జీఎస్డీపీ రూ.4,51,580 కోట్లుందని అన్నారు. రాష్ట్ర వృద్ధిరేటు నాడు 5.4 శాతం ఉందన్నారు. జీఎస్డీపీ ఇప్పుడు రూ.8,65,688 కోట్లకు పెరిగిందని అన్నారు. రాష్ట్ర వృద్ధిరేటు ఇప్పుడు 10.5 శాతం ఉందన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం, తాగునీరు అందించడం కోసమే అప్పులు తెస్తున్నా మని అన్నారు. కేంద్ర ప్రభుతానికి రూ.2,72,926 కోట్లు పన్నుల రూపం లో చెల్లించామని చెప్పారు. వివిధ పథకాల అమలుకు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చేది రూ.31,802 కోట్లు అని వివరించారు. సామాన్యులపై ఖర్చు చేస్తేనే డబ్బు చెలామనిలో ఉంటుందన్న నర్సిరెడ్డి వ్యాఖ్యలను హరీశ్రావు సమర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయరంగం, గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించామని, కోత పెట్టలేదని చెప్పారు. ఆర్థిక మాంద్యం కారణంగాత నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించలేదని అన్నారు. ఖైదీలకు క్షమాబిక్ష, టెట్ నిర్వహణ అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.