Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టులపై ఖర్చు రూ.79,236 కోట్లు
- జాప్యం కారణంగా పెరిగిన మొత్తం రూ.1.32 లక్షల కోట్లు
- అయినా పూర్తికాలేదు
- సర్కారుపై 'కాగ్' ఆక్షేపణ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో అప్పులు,వడ్డీలు పెరుగుతున్నాయని, ఈ పరి స్థితి ఆందోళనకరమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) సర్కారు తీరును ఆక్షేపించింది. 2017-18 ఆర్ధిక సంవత్సర కాగ్రిపోర్ట్ను ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ. 1 లక్షా 42 వేల కోట్లు ఉన్నాయని, రెవెన్యూ రాబడితో పోలిస్తే వడ్డీ చెల్లింపులు 12.19శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏటికేడు వడ్డీ చెల్లిం పుల శాతం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఏడేళ్లలో రాష్ట్రం చెల్లించాల్సిన అప్పులు రూ.65,740 కోట్లు ఉన్నాయని తేల్చిచెప్పింది. వాస్తవానికి తెలంగాణ రెవెన్యూ లోటు రూ.284.74 కోట్లు కాగా, ద్రవ్యలోటు రూ. 27,654 కోట్లు ఉన్నదని తెలిపింది. క్యాపిటల్ వ్యయం విషయంలో రాష్ట్రం ముందంజలో ఉన్నా, విద్యారంగం కేటాయింపుల్లో వెనుకబడి ఉన్నదని పేర్కొన్నది. 2014-18 మధ్య ప్రాజెక్టుల పై రూ.79,236 కోట్ల ఖర్చు చేశారని, ప్రాజెక్టులు పూర్తికాకపో వడంతో ఆర్థికవద్ధి సాధ్యం కాలేదని అభిప్రాయపడింది. 19 ప్రాజెక్టుల తొలి అంచనా వ్యయం రూ.41,021 కోట్లు కాగా, పనుల జాప్యం వల్ల రూ. 1 లక్షా 32 వేల కోట్లకు పెరిగిందని వివరించింది. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్ నుంచి అప్పులపై ఆధారపడటం వల్ల వడ్డీల చెల్లింపులు పెరిగాయని తెలిపింది. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తున్నదని, ఫలితాలు మాత్రం ప్రకటించడం లేదని ఆక్షేపిం చింది. ప్రాజెక్టుల నిర్మా ణంలో జాప్యం వల్ల అంచనా వ్యయం విపరీతంగా పెరిగిందని చెప్తూ 19సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తొలిఅంచనా వ్య యం రూ.41.201 కోట్లు కాగా, జాప్యం కారణంగా అది రూ.1లక్ష 32వేల 928 కోట్లకు పెరిగిందని అభిప్రాయప డింది. ఈ ప్రాజెక్టులపై ఇప్పటి వరకు రూ.70,758 కోట్లు ఖర్చయినా అవిఇంకా పూర్తికాలేదని తెలిపింది. విద్యుత్ పంపిణీసంస్థలు ఆర్థికపునరుత్తేజం జరగాలంటే రాష్ట్ర ప్రభు త్వం తన బకాయిలను వెంటనే విడుదల చేయా లని సూచిం చింది.రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వద్ధి రేటు కన్నా పెరిగాయని తెలిపింది. వైద్య, ఆరోగ్య, సాంఘికసంక్షేమ విభాగాల కింద పదేపదే మిగుళ్ళు ఏర్పడుతున్నాయని, ఖర్చు సరిగ్గా చేయక పోవడం ఆశాఖల అసమర్ధతను సూచిస్తోందని విమర్శిం చింది.