Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన స్పీకర్పోచారం
- పలు కమిటీలకు చైర్మెన్లు, సభ్యుల నియామకం
- శాసనసభ నిరవధిక వాయిదా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మెన్గా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీని నియమించినట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి శాసనసభలో ప్రకటించారు. అంచనాల కమిటీ చైర్మెన్గా సోలిపేట లింగారెడ్డి, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మెన్గా ఆశ న్నగారి జీవన్రెడ్డి నియమితులైనట్టు ఈ సందర్భంగా పోచారం ప్రకటించారు. ఆదివారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ
బిల్లు ఆమోదం పొందిన అనంతరం స్పీకర్.. ఈ కమిటీల చైర్మెన్లు, సభ్యుల వివరాలను ప్రకటించారు. పీఏసీలో సభ్యులుగా జైపాల్ యాదవ్, రమావత్ రవీంద్రకుమార్, బిగాల గణేశ్ గుప్తా, గాదరి కిశోర్, గడ్డంగారి విఠల్, పెద్ది సుదర్శన్రెడ్డి, శ్రీధర్బాబు, సండ్ర వెంకటవీరయ్య వ్యవహరిస్తారు. అంచనాల కమిటీలో కోనేరు కోనప్ప, చిరుమర్తి లింగయ్య, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, జాజుల సురేందర్, తూర్పు జయప్రకాశ్రెడ్డి సభ్యులుగా ఉంటారు. పబ్లిక్ అండర్ టేకింగ్లో కల్వకుంట్ల విద్యాసాగరరావు, అబ్రహాం, ఆశన్నగారి జీవన్రెడ్డి, బాణోత్ శంకర్నాయక్, నల్లమోతు భాస్కరరావు, కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి, అహ్మద్ పాషాఖాద్రీ, ప్రకాశ్గౌడ్ సభ్యులుగా ఉంటారని స్పీకర్ తెలిపారు. రైల్వే కన్సల్టేషన్ కమిటీ సభ్యుడిగా నన్నపనేని నరేందర్ వ్యవహరిస్తారని ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ఆయన తెలిపారు.