Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాంద్యం నేపథ్యంలో సామాన్యులకు
- ఆర్థిక భరోసా కల్పించాలి : మండలిలో నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కౌలు రైతులను ఆదుకుంటేనే రాష్ట్రంలో వ్యవ సాయ రంగం అభివృద్ధి చెందుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో 30 శాతం మంది కౌలురైతులున్నారని చెప్పారు. ఆదివారం శాసనమండలిలో చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ రైతుబంధు పథకాన్ని పట్టాదారులకే వర్తింపచేస్తున్నా రని అన్నారు. కౌలురైతులను ప్రభుత్వం ఆదుకోవా లని కోరారు. పీఆర్సీ అమలు, ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు పెంపు ఎప్పుడో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యో గుల వేతనాలు పెంచాలని కోరారు. గ్రామపంచా యతీ, మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలన్నారు. ప్రాథమిక విద్యలో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభిం చాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వ ప్రాథ మిక విద్యారంగం అభివృద్ధి చెందబోదని అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీలో ప్రయాణించే వారికి అనేక రాయితీలు ప్రకటిస్తోందని చెప్పారు. కానీ ఆర్టీసీకి ఆ సొమ్మును చెల్లించడం లేదన్నారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ రాయితీలు చెల్లించకపోవడం ఓ కారణమని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. జర్నలిస్టుల కు ఇండ్లస్థలాలివ్వాలని చెప్పారు. విద్యారంగంలో ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేయాలని సూచిం చారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో సామాన్యులు, పేదలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని సూచిం చారు. అప్పుడే డబ్బు చెలామణిలో ఉంటుందని, ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కడానికి దోహదపడు తుందని చెప్పారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఉందని ప్రకటించడంలో అర్థమేంటనీ ప్రశ్నించారు.
ఎస్టీ రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలోనే : జీవన్రెడ్డి
ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన 10 శాతానికి రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ సభ్యుడు టి జీవన్ రెడ్డి అన్నారు. ఎస్టీ రిజర్వేషన్లు పెంపు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని చెప్పారు. కానీ రిజ ర్వేషన్లు 50శాతం మించకూడదనే నెపంతో రాష్ట్ర ప్రభుత్వం పెంచడం లేదన్నారు. మహారాష్ట్రలో మరా ఠాలకు 16శాతం రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. మహారాష్ట్రలో 52శాతం రిజర్వేషన్లు అమలవుతున్నా యని అన్నారు.
మహారాష్ట్ర హైకోర్టు మరాఠాల రిజ ర్వేషన్లను 12శాతానికి తగ్గించిందని చెప్పారు. దీంతో అక్కడ 64 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని అన్నారు. ఇదే తరహాలో ఎస్టీలకు రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశముందన్నారు. టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (టెట్) నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏడేండ్లు శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలకు అక్టోబర్ 2న గాంధీ 150వ జయంతి సందర్భంగా క్షమాబిక్ష పెట్టాలని కోరారు.
నియోజకవర్గ అభివృద్ధి నిధి ఇవ్వాలి : జాఫ్రీ
నియోజకవర్గ అభివృద్ధి నిధి (సీడీపీ) ఇవ్వాలని ఎంఐఎం పక్ష నేత సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ అన్నారు. ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలన్నారు. ఏపీలో ఉద్యోగులకు 27శాతం ఐఆర్ ప్రకటించారని చెప్పారు. తెలంగాణ లోనూ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న నలుగురు సభ్యులను నియమించాలన్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్, సభ్యులను, లోకాయుక్త, ఉపలోకాయుక్తలను నియమించాలని సూచించారు.
వీసీలను నియమించాలి : రామచంద్రరావు
విశ్వవిద్యాలయాల్లో వీసీలను వెంటనే నియమిం చాలని బీజేపీ సభ్యులు ఎన్ రామచంద్రరావు డిమాం డ్ చేశారు. ఇన్చార్జీ వీసీలు ఉండడం వల్ల పనులు పెండింగ్లో ఉంటున్నాయని చెప్పారు. ఓయూలో 1,268 పోస్టులకు 774, కేయూలో 390 పోస్టులకు 290 ఇలా అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఈము రైతులను ఆదుకోవాలని చెప్పారు. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిం చాలన్నారు. ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం ప్రకటించా లని డిమాండ్ చేశారు.
నోట్లరద్దు, జీఎస్టీ, ప్లానింగ్ కమిషన్ రద్దు వల్ల దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం కలిగిందని ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు చెప్పారు. ఆర్థిక మాంద్యం ఉన్నా అభివృద్ధి, సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని చీఫ్విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ కూచుకుళ్ల దామోదర్రెడ్డి అన్నారు.