Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహబూబ్నగర్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ -హన్వాడ
ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి అక్కాచెల్లెలు మృతిచెందారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని మాదారంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ లెనిన్ తెలిపిన వివరాల ప్రకారం.. సాయిలు- అంజమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. పెద్దలు వ్యవసాయ పనుల్లో నిమగమై ఉండగా రజిత(11), మోక్షిత(4) అక్కడే ఆడుకున్నారు. కొద్దిసేపటి తరువాత పక్కనే ఉన్న నీటికుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అటూ ఇటూ వెతుకుతుండగా కుంటలో మృతదేహాలు పైకి తేలి కనిపించాయి. ఇద్దరు కుమార్తెలు విగతజీవులవ్వడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.