Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్
నవతెలంగాణ-రాంనగర్
ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం ఎందుకింత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని అఖిల భారత రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె.కె.దివాకర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ.. కార్మికుల పట్ల కర్కశంగా వ్యవహరించిన గత ప్రభుత్వాలకు పట్టిన గతే కేసీఆర్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. కవి సమ్మేళనంలో పలువురు కవులు సమ్మెకు మద్దతుగా కవితలు వినిపించారు. తెలంగాణ సాహితీ నగర అధ్యక్షులు జి.నరేష్ అధ్యక్షతన నిర్వహించిన సమ్మేళనంలో మోదుగుపూలు సంపాదకులు భూపతి వెంకటేశ్వర్లు, కవి తంగిరాల చక్రవర్తి, సలీమా, ఎం.నరహరి, శ్రీనివాస్, సత్యమూర్తి పాల్గొన్నారు.