Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయుడి నుంచి రూ.8వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత
- సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఘటన
నవతెలంగాణ- జోగిపేట
ఉపాధ్యాయుడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులివ్వడానికి లంచం డిమాండ్ చేసిన ఎస్టీఓ, సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మంగళవారం జరిగింది. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వట్పల్లి మండలం దేవునూర్ గ్రామానికి చెందిన సంగమేశ్వర్ పుల్కల్ మండలం చోటకూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులకు సంబంధించి జోగిపేటలోని ఎస్టీఓ కార్యాలయంలో ఎస్టీఓ దేవేందర్, సీనియర్ అసిస్టెంట్ జయప్రకాశ్చారిని సంప్రదించాడు. కార్యాలయం చుట్టూ తిప్పించుకుని, చివరకు రూ.10 వేలు లంచం ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేశారు. దాంతో సంగమేశ్వర్ రూ.8వేలు ఇచ్చేందుకు ఎస్టీఓ అధికారులతో ఒప్పందం కుదుర్చుకుని 11వ తేదీన సంగారెడ్డిలోని ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించి విషయాన్ని వివరించాడు. మంగళవారం మధ్యాహ్నం సంగమేశ్వర్ డబ్బులిచ్చేందుకు ఎస్టీఓ కార్యాలయానికి వెళ్లాడు. డబ్బులు తీసుకుటుం డుంగా ఎస్టీఓ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకు న్నారు. వారిపై కేసు నమోదు చేశారు. దాడుల్లో సీఐలు మురళీమోహన్, భరత్ కుమార్, శంకర్ రెడ్డి పాల్గొన్నారు.