Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకుల ఖాతాలు.. లాకర్లపైనే దృష్టి
- ఒక లాకర్ నుంచి రెండు కోట్లకు పైగా బంగారు నగలు?
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రముఖ నిర్మాణ సంస్థ మెఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రా కంపెనీ యాజమాన్యం ఆస్తులపై మంగళవారం ఐదో రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. కంపెనీ యాజమాన్యం మాత్రం ఇది ఐటీ అధికారులు ప్రతి ఏటా జరిపే ఖాతాల పరిశీలనలో భాగమేనని తెలిపినప్పటికీ.. అందుకు భిన్నంగా ఐటీ అధికారులు ఐదు రోజులు సీరియస్గా వారి నివాసాలు, కార్యాలయాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్లలో సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. ఐదో రోజు కూడా బాలానగర్, ఐడీఏ బొల్లారం, మాదాపూర్ కావేరి హిల్స్లో మెఘా కంపెనీ చైర్మెన్ పిచ్చిరెడ్డి, ఎండీ కృష్ణారెడ్డి, మరో డైరెక్టర్కు చెందిన ఖాతాలు, లాకర్లను ఐటీ అధికారులు సోదాలు చేశారని తెలిసింది. ఈ సమయంలో సంబంధితులనూ వెంట తీసుకుని వెళ్లి మరీ సోదాలు జరిపారు. అన్ని ఖాతాలలో ఎంత మేరకు నగదు ఉంది.. లాకర్లలో ఎంత మొత్తంలో బంగారు నగలు, వజ్రాలు ఉన్నాయనేది ఐటీ అధికారులు గోప్యంగా ఉంచారని సమాచారం. కాగా బాలానగర్ ఆంధ్రాబ్యాంకులోని లాకర్ నుంచి ఒక బాక్సు నిండా నగలను ఐటీ అధికారులు స్వాధీనపరుచుకున్నట్టు తెలిసింది. వాటి విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఐటీ వర్గాలను బట్టి తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఐటీ అధికారులు బహిరంగంగా చెప్పడానికి నిరాకరిస్తున్నారు.
మొదటి నుంచి మెఘా కంపెనీకి సంబంధించి తాము చేస్తున్న సోదాల గురించి ఐటీ అధికారులు గోప్యతను పాటిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక పోలీసుల నుంచి కూడా సెక్యూరిటీ సహాయాన్ని తీసుకోకుండా సీఐఎస్ఎఫ్కు చెందిన ఒక సెక్షన్ సాయుధ పోలీసుల సెక్యూరిటీతో సోదాలను నిర్వహి స్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబయి, బెంగళూ రుల నుంచి తరలివచ్చిన ఐటీ ఇన్వెస్టిగేషన్ టీమ్లు ఈ సోదాలను కొనసాగిస్తున్నాయని తెలిసింది. ఇంత పకడ్బందీగా ఐటీ అధికారుల సోదాలు కొనసాగడం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే అనే అను మానాలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెర్చ్వారెంట్లు తీసుకుని మరీ ఐటీ అధికా రులు తమ విచారణను సాగిస్తున్నారని తెలిసింది. తొలుత ఒక రోజు మాత్రమే సాగుతాయని భావించి న ఈ సోదాలు ఐదు రోజుల పాటు కొనసాగడంపట్ల రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. చివరికి ఐటీ అధికారులు ఈ సోదాల ద్వారా ఏం తేలుస్తారో అనే ఉత్కంఠ కూడా నెలకొంది.