Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రముఖ నిర్మాణ సంస్థ మెఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రా కంపెనీపై ఐటీ అధికారుల సోదాలు ఆరో రోజు బుధవారం ముగి శాయి. సాయంత్రం ఆరు గంటల వరకూ సాగిన సోదాలు చివరికి కీలక రికార్డులు, డాక్యుమెంట్లు, కంప్యూటర్ డేటా తదితర పత్రాల స్వాధీనంతో ముగిసినట్టు తెలిసింది. లక్ష కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో నిర్మాణమవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు తో సహా ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ల లో పలు ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణపు పనులను పర్యవేక్షిస్తున్న మెఘా కంపెనీపై ఏకంగా ఆరు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం అన్ని వర్గాలలో చర్చనీయాంశమైంది. చివరి రోజున జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, మాదాపూర్లలో మెఘా చైర్మెన్ పిచ్చిరెడ్డి, ఎండీ కృష్ణారెడ్డి, ఇతర డైరెక్టర్లకు చెందిన బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు సోదాలు నిర్వహించార ని తెలిసింది. అలాగే బ్యాంక్ లాకర్ల నుంచి అత్యంత విలువైన బంగారు నగలను కూడా అధికా రులు స్వాధీనపరచుకున్నారని తెలిసింది. ఈ సందర్భంగా మెఘా కంపెనీకి చెందిన ఆడిటర్ల సమక్షంలోనే ఆ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మా ణాలు, వాటికి అయిన పెట్టుబడులు, వ్యయం, సాంకేతిక యంత్ర, సామాగ్రి కొనుగోళ్లు, జరిపిన ట్యాక్స్ చెల్లింపుల గురించి ఐటీ అధికారులు ఆరా తీశారని సమాచారం.